బీసీలకు న్యాయం చేసింది సీఎం కేసీఆరే..

309
srinivas goud
- Advertisement -

బీసీలకు న్యాయం చేసిన ఏకైక సీఎం… కేసీఆర్‌ అన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. టీఆర్ఎస్‌ఎల్పీలో మీడియాతో మాట్లాడిన శ్రీనివాస్ గౌడ్.. మున్సిపల్ ఎన్నికల్లో 44 శాతం రిజర్వేషన్లు ఇచ్చారని చెప్పారు. ప్రభుత్వ వసతి గృహాల్లో నాణ్యమైన భోజనం కోసం గతంలో ఎన్నో ధర్నాలు జరిగేవి. ఇప్పుడు సన్నబియ్యంతో కూడిన భోజనం పెడుతున్నామని చెప్పారు. ప్రతి పథకంలోనూ 90 శాతం మంది లబ్దిదారులు అణగారిన వర్గాల వారే ఉన్నారని మంత్రి తెలిపారు.

మార్కెట్‌ చైర్మన్లు, నామినేటేడ్‌ పదవుల్లోనూ బీసీలకు ప్రాధాన్యం ఇచ్చారని చెప్పిన శ్రీనివాస్ గౌడ్… కేంద్రంలో బీసీలకు ప్రత్యేక శాఖ ఉండాలని కేసీఆర్‌ డిమాండ్‌ చేశారని పేర్కొన్నారు. నియోజకవర్గానికో బీసీ గురుకుల పాఠశాల ఏర్పాటు చేశారని….విపక్షాలు ఇప్పుడు ప్రభుత్వ వసతి గృహాలను పరిశీలిస్తే వాస్తవం తెలుస్తుందన్నారు.

- Advertisement -