ప్రతిపక్షాలది రాక్షస క్రీడ: శ్రీనివాస్ గౌడ్

691
srinivas goud
- Advertisement -

ప్రతిపక్షాలు రోజు రోజుకు దిగజారుతున్నాయని మండిపడ్డారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. టీఆర్ఎస్‌ఎల్పీలో మీడియాతో మాట్లాడిన శ్రీనివాస్ గౌడ్‌పిచ్చి పట్టినట్టు ప్రతిపక్ష నేతలు ప్రవర్తిస్తున్నారు…ఉస్మానియా ఆస్పత్రి కడితే తలలు నరుక్కుంటామన్నారు…వాళ్లకు అల్జీమర్స్ వ్యాధి సోకినట్టుందన్నారు.

70 సంవత్సరాల్లో ఉస్మానియా గురించి ఏనాడైనా కాంగ్రెస్ నేతలు ఏనాడైనా ఆలోచించారా ?…ఇన్నేళ్లు గడ్డి పీకి ఇపుడు ఉత్తమ్ మాట్లాడుతున్నారు ..ఏనాడైనా గతం లో ఉత్తమ్ ఉస్మానియా ను సందర్శించారా ?…కెసిఆర్ ముందు చూపుతోనే 2015 లోనే ఉస్మానియా కు కొత్త భవనాన్ని ప్రతిపాదిస్తే అడ్డుకున్నదెవరు ?అని ప్రశ్నించారు.

కిషన్ రెడ్డి ,దత్తాత్రేయ ,ఉత్తమ్ ,భట్టి అందరూ ఉస్మానియా కు కొత్త భవనాన్ని వ్యతిరేకించారు…కాంగ్రెస్ నేతలు 1978 నుంచి 2009 దాకా తెలంగాణ కు ఒక కొత్త మెడికల్ కాలేజీ ఎందుకు తేలేక పోయారు ?…తెలంగాణ ఉద్యమం ప్రభావం తో కొత్త మెడికల్ కాలేజీలు తెచ్చారు…తెలంగాణ వచ్చాక ఐదు మెడికల్ కాలేజీలు తెచ్చాం అన్నారు.

కేసీఆర్‌ ఉద్యమం లో మొత్తుకుంటే తప్ప రెండు మెడికల్ కాలేజీలు ఇవ్వలేదు…ఉస్మానియా లో ఖాళీ జాగా లో నాలుగు అంతస్థులకు మించి భవనం కట్టడానికి లేదని అజ్ఞానులకు తెలియదా ?…మెడికల్ కాలేజీ కి టీచింగ్ ఆస్పత్రి కి మధ్య ఎనిమిది కిలోమీటర్ల లోపే ఉండాలి .అందుకే కట్టాలి…కాంగ్రెస్ కు అధికారం లో ఉండగా విజన్ లేదు ..ఇపుడు అంత కన్నా లేదన్నారు.

మహబూబ్ నగర్ కు ఆధునాతన మెడికల్ కాలేజీ తీసుకొచ్చి పేదలకు మేలు చేశాం…కాళేశ్వరం నీళ్లు కషాయపు నీళ్లా ?కడుపు చించుకుంటున్నారు…వైద్య రంగము లో మా ప్రభుత్వం వచ్చాకే పెను మార్పులు వచ్చాయి…కాళ్లలో కట్టెలు పెట్టడమే కాంగ్రెస్ ,బీజేపీ ల పని…ఢిల్లీ లో ఆ రెండు పార్టీలు కొట్లాడుకుంటాయన్నారు.

తెలంగాణ లో మాత్రం కలిసి పనిచేస్తాయి .ఇదేం నీతి .…ఉస్మానియా కు ప్రస్తుతం ఉన్న చోట భవనం కట్టక వేరే చోట కడితే మెడికల్ సీట్లు పోతాయనే జ్ఞానం లేదా ?
…కోర్టులకు పోయి అభివృద్ధిని అడ్డుకోవడమే పతిపక్షాల పని…కరోనా కంటే కాంగ్రెస్సే ప్రమాదకారి…ప్రతిపక్షాలు సృష్టించే భయాందోళనలతో బతుకుతారనుకుంటున్న కరోనా రోగులు చనిపోతున్నారని తెలిపారు.

వైద్య రంగం లో మా ప్రభుత్వం తెచ్చిన మార్పులేమిటోపట్టణ గ్రామీణ ప్రాంతాల్లో కెసిఆర్ కిట్ తీసుకున్న వారిని ,cmrf తీసుకున్న వారిని అడిగితే తెలుస్తుంది
…దయచేసి పేద వాళ్ళ ఆరోగ్యం తో చెలగాటం ఆడొద్దని కాంగ్రెస్ ,బీజేపీ నేతలకు చేతులెత్తి మొక్కుతున్నా …వారసత్వ కట్టడాల పేరుతో కొత్త భవనాల నిర్మాణాన్ని ఆపొద్దన్నారు.

ఉస్మానియా కు కొత్త కట్టడాన్ని ఇపుడున్న స్థలం లో కడితే అడ్డుకోబోమని ప్రతిపక్షాలు హామీ ఇస్తే ఒక్క ఏడాది లోనే అద్భుత భవనాన్ని కట్టి చూపిస్తాం…ఓ పద్ధతి ప్రకారం సీఎం కెసిఆర్ ను బద్నామ్ చేసేందుకు కాంగ్రెస్ ,బీజేపీ లు కుట్ర పన్నాయి..ప్రజలకు అన్ని విషయాలు తెలుసు ..ఇలాంటి కుట్రలను వారే అడ్డుకుంటారు…కెసిఆర్ కు మంచి పేరు రావడాన్ని ప్రతిపక్షాలు ఓర్వలేకనే సైన్ధవ పాత్ర పోషిస్తూ అభివృద్ధికి అడ్డుపడుతున్నాయి…ఉస్మానియా కు భవనం కట్టోద్దు పేదలు వాళ్ళ చావు వాళ్ళు చావాలనే వైఖరి తో ప్రతిపక్షాలు రాక్షస క్రీడ ఆడుతున్నాయి..సమైక్య పాలనలో పాలకుల అడుగులకు మడుగులొత్తిన నేతలు ఇపుడు అదే పంథా తో తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడుతున్నారని చెప్పారు.

- Advertisement -