వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలి:శ్రీనివాస్ గౌడ్

142
srinivas goud
- Advertisement -

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పిలుపునిచ్చిన భారత్ బంద్ తెలంగాణలో ప్రశాంతంగా కొనసాగుతోంది. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ నేతలు,కార్యకర్తలతో కలిసి ఆందోళనలో పాల్గొన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.

కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ రైతాంగ సంక్షేమం కోసం రైతుబంధు, బీమా పథకాలతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టే బిల్లులను కేంద్రం భేషరతుగా వెనక్కి తీసుకోవాలని, లేకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాలే బిల్లులను వ్యతిరేకిస్తుంటే ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం కార్పొరేట్‌ సంస్థల ప్రయోజనాల కోసం రైతాంగాన్ని సంక్షోభంలోకి నెట్టేందుకు ఈ బిల్లులు తీసుకువచ్చారని మండిపడ్డారు. బీజేపీ పాలిత రాష్ట్రమైన మధ్యప్రదేశ్‌ సీఎం ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారని గుర్తు చేశారు.

- Advertisement -