విద్యుత్ అధికారులకు మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఆదేశాలు..

42
Minister Srinivas Goud
- Advertisement -

మహబూబ్ నగర్ పట్టణంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నా ట్యాంక్ బండ్, పెద్దచెరువులో నిర్మిస్తున్న ఐలాండ్‌కు విద్యుత్ సరఫరా కోసం కేబుల్ లైన్లను ఏర్పాటు చేయాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ లైట్లు ఏర్పాటు, సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణ పనులకు, మినీ శిల్పారామంకు అవసరమైన విద్యుత్ సరఫరాకు అందించాలి. నూతన ట్రాన్స్ఫార్మర్స్, లైన్లను సత్వరం ఏర్పాటు చేయాలని, హన్వాడ మండలం లోని పలు గ్రామాల్లో 13 ట్రాన్స్ఫార్మర్స్, మహబూబ్ నగర్ గ్రామీణ మండలంలోని 19 ట్రాన్స్ఫార్మర్స్ లను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో పలు గ్రామాల్లో వ్యవసాయ అవసరాలకు మెరుగైన విద్యుత్ సరఫరాకు వెంటనే ట్రాన్స్ఫార్మర్స్ లను బిగించాలని జిల్లా విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు SE మూర్తి,EE, DEలు, MBNR కౌన్సిలర్ జాజిమొగ్గ నర్శింహులు, హన్వాడ మండల ప్రజా ప్రతినిధులు కృష్ణయ్య,రమణ రెడ్డి, చెన్నయ్య, హరిచందర్ నాయక్, చుక్కయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -