అధికారికంగా బసవేశ్వర జయంతి ఉత్సవాలు..

138
srinivas goud
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత బసవేశ్వర ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. సామాజిక‌వేత్త మ‌హాత్మా బసవేశ్వర 889వ జయంతి ఉత్సవాల సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో బసవేశ్వర విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు శ్రీనివాస్ గౌడ్.

ట్యాంక్ బండ్ పై మహాత్మా బసవేశ్వర విగ్రహాన్ని ఏర్పాటు చేశామని తెలిపిన శ్రీనివాస్ గౌడ్… అన్ని జిల్లాలలో అధికారికంగా బసవేశ్వర జయంతి ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. కుల రహిత సమాజ స్థాపనకు కృషి చేసిన వ్యక్తి బసవేశ్వరుడని కొనియాడారు. దానం, ధర్మం, సమ సమాజం కోసం పాటుపడిన సామాజిక వేత్త అని కొనియాడారు. ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట రావు, మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -