- Advertisement -
రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి శాంతమ్మ కన్నుమూశారు. హైదరాబాద్లో శుక్రవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో గుండెపోటు రావడంతో ఆమె మరణించారు. శాంతమ్మ అంత్యక్రియలు మహబూబ్ నగర్ పట్టణంలోని వారి వ్యవసాయ క్షేత్రంలో శనివారం సాయంత్రం జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 14న శ్రీనివాస్ గౌడ్ తండ్రి నారాయణ గౌడ్ మరణించిన విషయం తెలిసిందే.
- Advertisement -