పారదర్శకత కోసమే ప్రజావేదిక:శ్రీనివాస్ గౌడ్

125
srinivas
- Advertisement -

ప‌్ర‌భుత్వ పాల‌న‌లో పార‌ద‌ర్శ‌క‌త…బాధితుల‌కు న్యాయం చేసేందుకే ప్ర‌జా వేదిక కార్య‌క్ర‌మం చేప‌ట్టామని స్పష్టం చేశారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాల‌యంలో ఆన్‌లైన్ ఫిర్యాదుల సేక‌ర‌ణ ప్ర‌జా వేదిక కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీనివాస్ గౌడ్….ప్ర‌తి గురువారం అధికారులు, మంత్రిగా తాను ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటామ‌ని తెలిపారు. ప్ర‌తి ఫిర్యాదుదారుడి స‌మ‌స్య పరిష్కారం అయ్యే వ‌ర‌కు ఫాలోఅప్ ఉంటుంద‌న్నారు.

ఉమ్మ‌డి జిల్లా ఫిర్యాదులు కూడా తీసుకొని సంబంధిత ఎమ్మెల్యే, అధికారుల‌కు పంపిస్తామ‌న్నారు. వైద్య స‌హాయం కోసం ఎమ్మెల్యే కార్యాల‌యంలో 24 గంట‌లు సంప్ర‌దించ‌వ‌చ్చని స్పష్టం చేశారు.

- Advertisement -