బండిది ప్రజాయాత్ర కాదు దొంగల యాత్ర- మంత్రి శ్రీనివాస్ గౌడ్

63
Minister srinivas goud
- Advertisement -

రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ నిర్వహిస్తున్న ప్రజా సంగ్రామయాత్రపై రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ నిప్పులు చెరిగారు. జోగులంబా గద్వాల జిల్లా పర్యటనలో భాగంగా స్థానిక శాసన సభ్యులు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, అలంపూర్ శాసన సభ్యులు డా. అబ్రాహాములతో కలసి మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ మీడియా సమావేశంలో మాట్లాడారు.

బండి సంజయ్ నిర్వహిస్తున్న ప్రజా సంగ్రామయాత్రను దొంగల యాత్రగా అభివర్ణించారు. యాత్రల పేరుతో బండి సంజయ్ ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. ఈ యాత్ర వల్ల తెలంగాణ ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు. బీజేపీ నాయకులకు దమ్ము ధైర్యం ఉంటె పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు ధాన్యం కొనుగోలుపై ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి సిగ్గు లేకుండా యాత్రలు చేస్తున్నారన్నారని మంత్రి ఆరోపించారు.

- Advertisement -