కందుల కొనుగోలుకు కేంద్రం అనుమతి

447
Minister Singireddy Niranjan Reddy
- Advertisement -

కందుల కొనుఓలుకు కేంద్రం అనుమతి ఇచ్చినట్లు తెలిపారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఈసందర్బంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ కి ధన్యవాదాలు తెలిపారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ముందు చూపుతో కేంద్రానికి లేఖ రాసి అనుమతి వచ్చేలా చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు రైతుల తరుపున కృతజ్నతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు.

కనీస మద్దతు ధరకు మరో లక్ష మెట్రిక్ టన్నుల కందుల కొనుగోలుకు రాష్ట్రం రాసిన లేఖపై స్పందించి కేంద్రం అనుమతించింది. 47,500 మెట్రిక్ టన్నులకు తొలివిడతలో అనుమతించిన కేంద్రం మలివిడతలో 4,500 టన్నులకు అనుమతి ఇచ్చింది. సాగునీటి వసతి పెరిగిన నేపథ్యంలో ఈ సారి భారీగా కందుల దిగుబడి వచ్చినట్లు తెలిపారు మంత్రి సింగిరెడ్డి.

- Advertisement -