కరోనా విపత్తులో రైతుల అకౌంట్లలోకి రైతుబంధు డబ్బులు

182
Minister Niranjan Reddy
- Advertisement -

ఇంతటి కరోనా కష్టకాలంలో కూడా రైతుల అకౌంట్లలో రైతుబంధు డబ్బులు వేసిన ఘనత సీఎం కేసీఆర్ దే అన్నారు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట. నియోజకవర్గంలోని అచ్చంపేట, పులిజాల ,ఉప్పునుంతల ,బల్మూర్ మండల కేంద్రాలతోపాటు పలు గ్రామాలలో రైతు వేదిక భవన నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.అనంతరం 6వ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు,ఎంపీ రాములు,రైతుబంధు జిల్లా సమన్వయ అధ్యక్షుడు పోకల మనోహర్,అడిషనల్ కలెక్టర్ మనూ చౌదరి,స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.

ఈసందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 60లక్షల మంది రైతుల అకౌంట్లలోకి రూ.7,500కోట్ల రూపాయలు జమ చేసినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతోనే తెలంగాణలో రైతులు సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. ప్రతిపక్షాలు కరోనా విపత్తును కూడా రాజకీయాలకు వాడుకుంటున్నాయని అన్నారు. ప్రజలకు సీఎం కేసీఆర్ పై నమ్మకంతో ఉన్నారని అన్నారు.

- Advertisement -