తిరుమలలో సీతక్క..ప్రియాంక విజయం కోసం పూజలు

4
- Advertisement -

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి సీతక్క దర్శించుకున్నారు. బుధవారం వేకువజాము శ్రీవారికి పుష్పాలు అలంకరించే తోమాల సేవలో కుటుంబ సభ్యులతో కలసి పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.

దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదశీర్వచనం అందించగా….ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల సీతక్క మీడియాతో మాట్లాడుతూ…. త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన మహిళా నేత ప్రియాంక గాంధీ వయనాడ్ లో నామినేషన్ వేస్తున్న శుభసందర్భంలో ఆమె ఘనవిజయం సాధించాలని ఆకాంక్షించారు.

కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకోవడంతో చాలా సంతోషంగా ఉందని….. రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక మొక్కులు చెల్లించుకోవాలని అనేక సార్లు అనుకున్న నేడు ఆ మొక్కులు చెల్లించుకునే భాగ్యం దక్కిందన్నారు. ఇరు తెలుగురాష్ట్రాలు అభివృద్ధిలో ముందుకు వెళ్లాలని కోరుకున్నట్లు తెలిపారు.

Also Read:Bigg Boss 8 Telugu: విష్ణుపై ఎలాంటి ఫీలింగ్ లేదన్న పృథ్వీ

- Advertisement -