- Advertisement -
రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మంగళవారం ఆమె నివాసంలో తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ తెగల ఉద్యోగుల డైరీ-2021ని ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు రామదాసు, ప్రధాన కార్యదర్శి దేవాసింగ్, సభ్యులు భట్టా రమేశ్, రవీందర్, విమల, వీరు నాయక్, యాకుబ్ నాయక్, కిషన్ నాయక్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో గిరిజన ఉద్యోగులు సమర్థవంతంగా పని చేయాలని సూచించారు. సీఎం కేసీఆర్ వచ్చాకే గిరిజనులకు ప్రయోజనం కలిగే అనేక పథకాలు అమలవుతున్నాయన్నారు. ఎన్నికల ఇచ్చిన హామీ మేరకు తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చారన్నారు. దాంతో గిరిజన బిడ్డలే తమ గ్రామాలను పాలించుకునే అవకాశం దక్కిందన్నారు.
- Advertisement -