మోడీకి గుణ‌పాఠం చెబుతారు: స‌త్య‌వ‌తి

98
satyavathi rathod
- Advertisement -

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీకి ప్ర‌జ‌లు గుణ‌పాఠం చెబుతార‌న్నారు మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్. మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌లో మీడియాతో మాట్లాడిన స‌త్య‌వ‌తి..మోడీ మత చిచ్చు దేశ హద్దులు దాటి ప్రపంచంలోకి ప్రవేశించిందని విమర్శించారు. దేశ సంపదను కొద్దిమందికి దోచిపెట్టి అన్ని వస్తువుల ధరలను పెంచుతూ ప్ర‌జ‌ల‌పై భారాన్ని మోపుతున్నార‌ని మండిప‌డ్డారు.

మతపరమైన అలజడి సృష్టించే నాయకులకు చరమగీతం పాడే రోజులు దగ్గరపడ్డాయన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ స్థాపించే పార్టీ దేశానికి ఎంతో అవసరముందన్నారు.

దేశంలోని అన్ని రాష్ట్రాలు కరెంట్ సమస్యను ఎదుర్కొంటుండగా, సీఎం కేసీఆర్ ముందు చూపుతో తెలంగాణలో అది ఉత్పన్నం కాలేదన్నారు. గిరిజన రిజర్వేషన్ల అంశాన్ని అసెంబ్లీ సాక్షిగా కేంద్రానికి పంపించామని, దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొడుతున్నార‌ని మండిప‌డ్డారు.

- Advertisement -