రైతు వ్యతిరేక చట్టాలను తక్షణమే రద్దుచేయాలి: సత్యవతి

134
minister
- Advertisement -

రైతు వ్య‌తిరేక చ‌ట్టాల‌ను కేంద్రం త‌క్ష‌ణ‌మే ర‌ద్దు చేయాల‌ని కేంద్రాన్ని డిమాండ్ చేశారు మంత్రి సత్యవతి రాథోడ్. మ‌హ‌బూబాబాద్ జిల్లా న‌ర్సంపేట రోడ్డు చౌర‌స్తాలో నిర్వహించిన బైక్ ర్యాలీలో ఎమ్మెల్యే శంకర్ నాయక్‌తో కలిసి పాల్గొన్నారు మంత్రి సత్యవతి రాథోడ్.

ఎమ్మెల్యే శంక‌ర్ నాయ‌క్ బైక్‌ను రైడ్ చేస్తుండ‌గా.. మంత్రి స‌త్య‌వ‌తి ఆ బైక్‌పై వెళ్లారు. ఈ ర్యాలీలో మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, వైస్ ఛైర్మన్ ఫరీద్ ఇతర నాయకులు, పార్టీ శ్రేణులు రైతులు, ప్రజాప్రతినిధులు, కార్మికులు, వాణిజ్య, వ్యాపార వర్గాలవారు పాల్గొన్నారు.

కేంద్ర ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ రైతులు ఇవాళ దేశ‌వ్యాప్తంగా భార‌త్‌బంద్ నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే.

- Advertisement -