పివి విజ్ఞాన వేదిక డిజైన్‌లను ఆవిష్కరించిన మంత్రి..

179
PV Vignana Vedhika Designs
- Advertisement -

రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అదేశాల మేరకు భారత మాజీ ప్రధాని, స్వర్గీయ పి వి నరసింహరావు నివసించిన వంగర గామ్రంను పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయటానికి సుమారు 11 కోట్ల రూపాయల ప్రతిపాదనలతో పి వి విజ్ఞాన వేదిక డిజైన్‌లను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో తన కార్యాలయంలో పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి కె యస్ శ్రీనివాస రాజుతో కలసి మంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి పివి శతజయంతి వేడుకలలో భాగంగా సిఎం కేసిఆర్ అదేశాల మేరకు వారి చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాలనే అశయంతో పి వి పేరిట పి వి విజ్ఞాన వేదికను వంగర గ్రామంలో నిర్మిస్తున్నామన్నారు. మాజీ భారత రాష్ట్రపతి అబ్దుల్ కలాం స్మృతివనం లాగా పి వి విజ్ఞాన వేదికను తీర్చిదిద్దుతున్నామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ రాష్ట్రం గర్వించే వ్యక్తిగా పట్వారీ నుండి ప్రధానమంత్రిగా ఎదిగిన స్వర్గీయ పి వి ప్రతి ఓక్కరికి స్పూర్తి ప్రధాతగా నిలిచారన్నారు. స్వర్గీయ మాజీ ప్రధాని పి వి ప్రవేశ పెట్టిన సంస్కరణలు, వారి పరిపాలన భవిష్యత్ తరాలకు తెలిసేలా సిఎం కెసిఆర్ అదేశాల మేరకు పి వి నివసించిన ఇంటిని మ్యూజియంగా, వంగర గ్రామంలో పి వి పేరుతో సుమారు 8 ఎకరాలలో పివి విజ్ఞాన వేదికను రూపోందిస్తున్నామన్నారు.

అందుకు మోదటి దశలో 7 కోట్ల రూపాయలతో పి వి విజ్ఞాన వేదికలో పి వి విగ్రహానికి ఫౌంటైన్, లైటింగ్, వారి విజయాలు, పోటో గ్యాలరీ, మోడిటేషన్ సెంటర్, సైన్స్ మ్యూజియం, మేజ్ గార్డేన్, చిల్డ్రన్ ఆట స్థలాలు, స్వాతంత్ర సమరయోధుల శిల్పాలు, యాంఫి థియేటర్, ఫుడ్ కోర్టుల నిర్మాణానికి 686.25 లక్షల రూపాయలను కేటాయించామన్నారు. పి వి నివాసంను మోమోరియల్ మ్యూజియంగా అభివృద్ది చేస్తున్నామన్నారు. వారు వాడిన వస్తువులను ఈ మ్యూజియంలో బద్రపర్చుతున్నామన్నారు. పి వి విగ్రహాం, ల్యాండ్ స్కేపింగ్ తో సిట్టింగ్ బెంచేస్. గజీ బోస్, మంచీనీటి వసతి, పాత్ వే లను 75.00 లక్షల రూపాయలతో  అభివృద్ది చేస్తున్నామన్నారు.

మొత్తం ప్రాజెక్ట్‌ వ్యయం 1098.45 లక్షలతో వంగరలోని పి వి విజ్ఞాన వేదికను నిర్మిస్తున్నామన్నారు. జి వో ఆర్ టి నెంబర్ 22 ప్రకారం రూ. 7 కోట్ల రూపాయలను తోలిదశ పనులకోసం కేటాయించామన్నారు. ఇప్పటికే టెండర్లు ను పిలిచామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్ .ఈ కార్యక్రమంలో పర్యాటకాబివృద్దిసంస్థ ఎం డి మనోహర్, టూరిజం అధికారులు రామకృష్ణ, కన్సల్టేంట్లు పాల్గోన్నారు.

- Advertisement -