ఆచార్య సెట్స్‌లో అజయ్ కుమార్

137
puvvada
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి- కొరటాల కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. ప్రస్తుతం హైదరాబాద్ శివారులో కోకాపేటలో ఆచార్య షూటింగ్ జరుగుతుండగా షూటింగ్ లొకేషన్‌ను మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ సందర్శించారు.

ఈ సందర్భంగా దర్శకుడు కొరటాలతో పాటు చిరంజీవిని కలిసి ముచ్చటించారు. ఈ సందర్భంగా మంత్రికి సినిమా విశేషాలను దర్శకుడు వివరించారు. ఈ సందర్భంగా చిత్రబృందానికి.. చిరంజీవికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. చిత్రం విజయం సాధించాలని ఆకాంక్షించారు పువ్వాడ.

ఇప్పటికే సినిమా షూటింగ్ 80 శాతం పూర్తికాగా మే 13వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. మణిశర్మ సంగీతం అందిస్తుండగా.. కొణిదెల ప్రొడక్షన్స్‌, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నిరంజన్‌ రెడ్డి, రామ్‌చరణ్‌ నిర్మాణంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.

- Advertisement -