మంత్రి పువ్వాడకు కరోనా పాజిటివ్

267
puvvada
- Advertisement -

రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ కరోనా పాజిటివ్‌గా తేలింది. సోమవారం నిర్వహించిన పరీక్షల్లో మంత్రి వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.

నాకు కరోనా అని తెలియగానే ప్రేమతో ఆందోళన చెందిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కొన్ని రోజుల నుంచి నన్ను కలిసిన ప్రతి ఒక్కరు కరోనా పరీక్షలు చేయించుకోవాలి. ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. నాకు ఫోన్ చేయడానికి గాని, కలవడానికి గాని ప్రయత్నించకండి. నా హెల్త్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. త్వరలోనే యధావిధిగా మీ మధ్యకు వచ్చి అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటాను” అని పేర్కొన్నారు.

- Advertisement -