అభివృద్ధి పథంలో తెలంగాణ: మంత్రి పువ్వాడ

245
puvvada
- Advertisement -

సీఎం కేసీఆర్ నాయకత్వంలో మంత్రి కేటీఆర్ మార్గదర్శకత్వంలో తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని తెలిపారు మంత్రి పువ్వాడ అజయ్‌.కరోనా లాంటి సంక్షోభంలో కూడా సంక్షేమానికి పెద్దపీట వేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు.

ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు స్వయంగా పంపిణీ చేశారు. పేద, ధనిక తారతమ్యం లేకుండా సబ్బండ వర్ణాల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తోందన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ మేనిఫెస్టోలో లేకున్నా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు రాష్ట్రంలో అమలు చేయడం ఎంతో గర్వించదగ్గ విషయమన్నారు.ప్రజలకు కావాల్సిన సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతుందని వివరించారు.

- Advertisement -