ఏపీ మంత్రి బొత్స‌ వ్యాఖ్యలపై మంత్రి వేముల కౌంటర్‌..

50
Minister Vemula
- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్దిపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వాస్త‌వాలే అని మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి అన్నారు. అయితే ఏపీలో మౌలిక వ‌స‌తులు ఆధ్వాన్నంగా ఉన్నాయంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఇచ్చిన కౌంట‌ర్‌కు టీఆర్ఎస్ నుంచి వ‌రుస‌గా ఘాటు ప్ర‌తిస్పంద‌న‌లు ఎదుర‌వుతున్నాయి. టీఆర్‌ఎస్‌ నేతలు బొత్స వ్యాఖ్య‌ల‌పై విరుచుకుపడుతున్నారు.తాజాగా మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి కూడా బొత్స వ్యాఖ్య‌ల‌ను తీవ్రంగా ఖండించారు.

బొత్స కుటుంబం హైద‌రాబాద్‌లోనే ఉంటోంది. బొత్స‌తో పాటు అక్క‌డి నేత‌ల కుటుంబాల‌న్నీ ఇక్క‌డే ఉంటున్నాయి. మీరూ (మీడియా ప్ర‌తినిధులు) కూడా హైద‌రాబాద్‌లోనే ఉంటున్నారు క‌దా. మ‌రి మ‌నం జ‌న‌రేట‌ర్ల‌ను వాడుతున్నామా? హైద‌రాబాద్‌లో జ‌న‌రేట‌ర్లు వాడుతున్నామ‌న్న వ్యాఖ్య‌ల‌ను బొత్స విజ్ఞ‌త‌కే వ‌దిలేస్తున్నా అన్నారు. బొత్స ఎందుకంత అక్క‌సుగా మాట్లాడాలి. ఉన్న విష‌యమే కదా కేటీఆర్ చెప్పారు.

ఏపీలో రోడ్లు బాగా లేవు మ‌రి. క‌రెంటుకు ఇబ్బంది ఉన్న‌ద‌ని వారి ముఖ్యమంత్రే చెప్పారు. విజ‌య‌వాడ నుంచి స్థిరాస్తి వ్యాపారులు హైద‌రాబాద్ వ‌స్తున్నారు. ఏపీని అభివృద్ధి చేస్తే మేం ఏమైనా అడ్డుప‌డుతున్నామా? ఉన్న మాట అంటే ఉలికిప‌డ‌ట‌మెందుకు? అంటూ మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి దుయ్యబట్టారు

- Advertisement -