జవాన్‌ మహేష్‌ త్యాగం మరువలేనిది: ప్రశాంత్ రెడ్డి

362
prashanth reddy
- Advertisement -

జమ్మూకాశ్మీర్ మచిల్ కుపువారలో ఉగ్రదాడిలో వీరమరణం పొందిన నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కోమన్పల్లి గ్రామానికి చెందిన ర్యాడా మహేష్ కు ఘన నివాళి అర్పించారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన మహేష్ చిన్న తనం నుంచే అమితమైన దేశభక్తి… దేశం మీద ప్రేమతో సైన్యం లో చేరి భారతావని కోసం నీవు చేసిన త్యాగం మరువలేనిదన్నారు.

భౌతికంగా మానుండి దూరమైన బాధ ఉన్నా…దేశం కోసం ప్రాణాలర్పించడం స్ఫూర్తి దాయకం అన్నారు.వీర సైనికుడా యావత్తు తెలంగాణ నీకు నివాళి అర్పిస్తుంది.మహేష్ త్యాగం వెలకట్టలేనిదైనా…రాష్ట్ర ప్రభుత్వం తరుపున మహేష్ కుటుంబానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, వేల్పూర్ వాసిగా నేను అండగా ఉంటాం అన్నారు.

మహేష్ తో పాటు వీరమరణం పొందిన సైనికులకు నా జోహార్లు వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారికి ఆ భగవంతుడు మనోధైర్యం ఇవ్వాలని….వీర జవాన్ల పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా అన్నారు.

- Advertisement -