నిఖాత్ జరీన్‌ను సన్మానించి మంత్రి ప్రశాంత్‌ రెడ్డి..

108
- Advertisement -

అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్ (52 kg ల విభాగం) లో గోల్డ్ మెడల్ సాధించిన నిజామాబాద్ ముద్దు బిడ్డ నిఖాత్ జరీన్ మొదటి సారి నిజామాబాద్ జిల్లా కేంద్రానికి రావడంతో జిల్లా ఎమ్మెల్యేలు,కలెక్టర్‌లతో కలిసి మంత్రి మేముల ప్రశాంత్‌ రెడ్డి ఆమెకు అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా అంబేద్కర్ భవన్ ఏర్పాటు చేసిన అభినందన సభలో మంత్రి ఆమెను సన్మానించి గౌరవించారు. ఈ మేరకు మంత్రి ప్రశాంత్‌ రెడ్డి వ్యక్తిగతంగా ఆమెకు ఒక లక్ష రూపాయల చెక్, అలాగే అమె కోచ్‌కు 50 వేల రూపాయల చెక్‌ను అందజేశారు.

- Advertisement -