రాష్ట్రంలో నీలి విప్లవం: వేముల

23
prashanth reddy
- Advertisement -

సీఎం కేసీఆర్ నిర్ణయంతో మత్య్సకారుల ఇంట ప్రతి ఏటా సంతోషాలు నెలకొన్నాయని తెలిపారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. బాల్కొండ నియోజకవర్గం ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ నాగపూర్‌ పాయింట్ వద్ద 62.86 లక్షల ఉచిత చేప పిల్లలను విడుదల చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ప్రశాంత్ రెడ్డి.. సీఎం కేసీఆర్ నిర్ణయంతో రాష్ట్రంలో నీలి విప్లవానికి నాంది పలికామన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో మత్స్యకారుల అభివృద్ధి జరిగిందన్నారు. చేప పిల్లలు విడుదల చేసే క్రమంలో నూతనంగా చేపపిల్లలు కౌంటింగ్ చేసే మిషన్ ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు.

ఏ దళారి ప్రమేయం లేకుండా మత్స్యకారులనే ఇందులో భాగస్వామ్యం చేయడం వల్ల వందల కోట్ల సంపద సృష్టి జరిగి వృత్తి దారుల కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాయని తెలిపారు. ఈ ఏడాది నిజామాబాద్ జిల్లాలోనే 1043 చెరువుల్లో 4.85 కోట్ల చేప పిల్లలు విడుదలకు ప్రణాళిక చేశామన్నారు.

- Advertisement -