ఢిల్లీలో టీఆర్ఎస్ ఆఫీస్‌ స్థలం…అప్పగింత పూర్తి

205
Vemula Prashanth Reddy
- Advertisement -

తెలంగాణ రాష్ట్రసమితి పార్టీకి దేశ రాజధాని ఢిల్లీలో తమ పార్టీ కార్యాలయం నిర్మించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం స్థలం మంజూరు చేసిన సంగతి తెలిసిందే. న్యూఢిల్లీలోని వసంత విహార్‌లో 1100 చదరపు మీటర్ల స్థలం కేటాయించింది. ఒక్కొక్కటి 550 చదరపు మీటర్లు ఉన్న రెండు పక్క పక్క ప్లాట్లను టీఆర్ఎస్‌కు కేటాయించింది.

ఇందుకు సంబంధించి అప్పగింత ప్రక్రియ పూర్తయిందని చెప్పారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో పార్టీ కార్యాలయ స్ధలాన్ని పరిశీలించారుపార్టీ నేతలు. స్థలం కేటాయింపుతో నిబంధనల ప్రకారం పార్టీ ఫండ్ నుండి రూ.8.64 కోట్లు చెల్లించారు. ఢిల్లీలో స్థలం కేటాయింపు జరగడంతో పార్టీ ఆఫీసు నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన జరిపి, త్వరితగతిన పూర్తి చేస్తామని పార్టీ నేతలు తెలిపారు.

- Advertisement -