- Advertisement -
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇవాళ ఉదయం స్వామి వారిని అభిషేకం సేవలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.
స్వామి వారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు. టీటీడీ అధికారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు పొన్నం.
ఇక మరోవైపు టీటీడీ అభివృద్ధిపై ఏపీ సీఎం చంద్రబాబు రివ్యూ నిర్వహించారు. వైసీపీ హయాంలో తీసుకున్న ముంతాజ్ హోటల్, హిందువులకు మాత్రమే టీటీడీలో ఉద్యోగాలు వంటి వాటిపై కీలక ప్రకటన చేశారు. టీటీడీలో అన్యమతస్తులను తొలగిస్తున్నట్లు స్పష్టం చేశారు.
Also Read:మోదీ విదేశీ పర్యటనల ఖర్చెంతో తెలుసా?
- Advertisement -