నిరసనల పేరుతో బీజేపీ ముసలి కన్నీరు: పొన్నం

1
- Advertisement -

బీజేపీ పార్టీ అవకాశవాద రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు మంత్రి పొన్నం ప్రభాకర్. దక్షిణా కొరియా పర్యటనలో ఉన్న పొన్నం…వీడియో ద్వారా స్పందించారు.అవకాశవాద రాజకీయాలు చేస్తూ ధర్నాలు , నిరసనలు పేరు మీద ముసలి కన్నీరు కార్చడం కాదు… నిజంగా తెలంగాణ అభివృద్ది కోసం పాటు పడాలనుకుంటే.. తెలంగాణకు అనేక రకాలుగా అన్యాయం జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందని ఎద్దేవా చేశారు.

బీజేపీ మూసి సందర్శనకు పోయింది..ధర్నాలు చేస్తుందని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి , పార్లమెంట్ సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నా..మూసి ప్రజలకు సంబంధించిన సమస్యలను లిఖిత పూర్వకంగా ఇవ్వండి.. వారికి జరగాల్సిన న్యాయం గురించి చెప్పాలన్నారు.

ప్రభుత్వం తప్పకుండా సానుకూలంగా స్పందిస్తుంది…సియోల్ పర్యటన తరువాత పునరావాసం తరువాత రీహాబిలిటేషన్ అవుతున్న వారి పట్ల ఎలాంటి అన్యాయం జరగకుండా చూసే బాధ్యత రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ది అని తెలిపారు.

Also Read:గంజాయి మత్తులో మర్డర్లు:కాంగ్రెస్ ఎమ్మెల్యే

- Advertisement -