శివలింగానికి ప్రత్యేక పూజలు చేసిన మంత్రి నిరంజన్ రెడ్డి..

202
- Advertisement -

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వనపర్తి జిల్లాలోని కొత్తకోట మండలం పామాపురం గ్రామంలోని రామేశ్వర ఆలయంలో శివలింగానికి ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం మంత్రి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు స్వయంగా వడ్డించారు. మంత్రి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.

- Advertisement -