తెలంగాణను నాశనం చేసిందే కాంగ్రెస్‌..

103
- Advertisement -

టీఆర్ఎస్ ను తరిమి కొట్టాలన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై మండిపడ్డారు మంత్రి నిరంజన్ రెడ్డి. ఈ మేరకు మీడియాకు ప్రకటన విడుదల చేసిన నిరంజన్ రెడ్డి…తెలంగాణను నాశనం చేసింది కాంగ్రెస్ అని దుయ్యబట్టారు. తెలంగాణ పౌరులను వలసల పాలుచేసింది కాంగ్రెస్…..తెలంగాణ ప్రజలను వంచించింది కాంగ్రెస్..తెలంగాణ అమరుల ఉసురు తగిలే కాంగ్రెస్ పార్టీ అంతర్ధానమవుతుందన్నారు. బీజేపీని ఎదురుకోవడం చేతగాక కాంగ్రెస్ చేతులు ముడుచుకుని కూర్చుందన్నారు.

నిర్మాణాత్మక ప్రతిపక్షం లేక నేడు దేశంలో బీజేపీ ఆడింది ఆట పాడింది పాటగా మారిందన్నారు. తెలంగాణ వరి ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్రాన్ని, బీజేపీని కాంగ్రెస్, రాహుల్ గాంధీ పార్లమెంటు బయటా, లోపలా ఒక్కసారి కూడా ప్రశ్నించలేదన్నారు. ఎవరికి భయపడి రాహుల్ గాంధీ ప్రశ్నించడం లేదు…తెలంగాణలో బీజేపీ గెలుపుకోసం బీజేపీకన్నా ఎక్కువగా కాంగ్రెస్ ఆరాటపడుతుందన్నారు.

గత పార్లమెంటు ఎన్నికల్లో ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ ఎన్నికల్లో, దుబ్బాక, హుజూరాబాద్ శాసనసభ స్థానాల ఉప ఎన్నికలలో ఈ విషయం స్పష్టమయిందని…కాంగ్రెస్ , టీడీపీ పాలనలో తెలంగాణకు జరిగిన అన్యాయంపై తిరుగుబాటు చేసి కేసీఆర్ నాయకత్వంలో ప్రజలు తెలంగాణ సాధించుకున్నారన్న విషయం రాహుల్ గుర్తుంచుకోవాలన్నారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణను కేసీఆర్ ఎంతో ముందుచూపుతో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నారన్నారు.

- Advertisement -