కాంగ్రెస్ పాలనలో కర్ణాటక అంధకారం..

57
- Advertisement -

కాంగ్రెస్ పాలనలో కర్ణాటక అంధకారంలో ఉందన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన..కర్ణాటకలో కాంగ్రెస్ గ్యారంటీలు పూటకొకటి ఎగిరిపోతున్నాయన్నారు. ఆరునెలలకే కర్ణాటక అతలాకుతలం అవుతుందని..అవమానాలు, అవహేళనలు  ఎదుర్కొని పోరాడి తెలంగాణ సాధించుకున్నాం అన్నారు.

తెచ్చుకున్న తెలంగాణలో కృష్ణ, గోదావరి జలాలను తెలంగాణ బీళ్లకు మళ్లించుకున్నాం అని తెలిపిన నిరంజన్ రెడ్డి…కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాం .. జిల్లాకో మెడికల్ కళాశాల ఏర్పాటు చేసుకున్నాం అన్నారు. విద్య, వైద్యం, తాగునీళ్లు, సాగునీళ్లు, విద్యుత్ రంగాలను గణనీయంగా అభివృద్ది చేసుకున్నాం అన్నారు.స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇంత వేగంగా అభివృద్ది చెందిన రాష్ట్రం లేదన్నారు.

ప్రజల కండ్ల ముందు కనిపిస్తున్న అభివృద్ది వదిలేసి కాంగ్రెస్ మాటలు ప్రజలు నమ్మరన్నారు. తెలంగాణ గురించి అడిగితే ఇడ్లీనా, దోశనా అని అధికార మదంతో అవమానకరంగా మాట్లాడి తెలంగాణ ప్రజలకు చేసిన గుండె కోత మిగిల్చారని…కాంగ్రెస్ చేసిన గాయాలను ప్రజలు అప్పుడే మరిచిపోరన్నారు. కాంగ్రెస్ పాలనలో అనుభవించిన బాధలు, కష్టాలు ప్రజలకు తెలుసన్నారు. అప్పుడే వాటిని మరిచిపోయి ప్రజలు కాంగ్రెస్ ను ఆదరిస్తారనుకోవడం అత్యాశ అని..38 రోజుల తర్వాత అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ అన్నారు.మూడోసారి కూడా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని సర్వేలు చెబుతున్నాయని..గత తొమ్మిదిన్నరేళ్లుగా ప్రజలతో ఉన్నాం .. వారికి ఏం చేయాలో చేశాం .. ఏమి చేయాలో తెలుసు అన్నారు.

Also Read:సబ్జా గింజలు..ఔషధ గుణాలు

- Advertisement -