సమస్యలు లేని రైతులకు బీజేపీ సమస్యగా మారింది- మంత్రి

58
Minister Niranjan Reddy
- Advertisement -

సమస్యలు లేని రైతులకు బీజేపీ సమస్యగా మారిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ వైఖరిని ఖండించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 4569 కొనుగోలు కేంద్రాలు ఇవాళ్టికి ప్రారంభించాం. యాసంగి పంటను కేంద్రం కొంటదా? కొనదా అనేది చెప్పమంటే చెప్పడానికి బీజేపీకి చేతకావడం లేదు. కొనుగోలు కేంద్రాల వద్దకు పోయి కొనుగోలు చేయాలని పార్టీ అధ్యక్షుడు వెళ్లడం హస్యస్పదంగా ఉంది. బీజేపీకి సిగ్గు చేరం ఉందా? పంట గురించి క్లారిటీ ఇవ్వరా? అని మంత్రి ప్రశ్నించారు.

రైతులకు ఉరితాళ్ళు పెరుతున్న పార్టీ బీజేపీ.. రైతుల దగ్గరకు వెళ్లి ఆందోళన చేసేందుకు బీజేపీకి ఉన్న అర్హత ఏముంది. నెలలపాటు రైతులు రోడ్లపై ఆందోళన చేసిన ఘనత బీజేపీకి చెందుతుంది. కొత్త తరాలకు ఉపాధి లేకుండా చేస్తున్న పార్టీ బీజేపీ అని మంత్రి దుయ్యబట్టారు. రాష్ట్ర బీజేపీ నేతలు చుంటలు.. కేంద్రం చెప్పిన విషయాలపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. యాసంగిలో పండే పంటలే బాయిల్డ్ రైస్ వడ్లు- అదే విషయం మేము రైతులకు చెప్తున్నాము. కొనుగోళ్ల సందర్భంగా కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి- అవి కూడా కేంద్రమే చెప్పింది. రైతులను ఆందోళనకు గురి చేస్తే చూస్తూ ఉరుకోము. కడుపుమండినోడు ఏమైనా పట్టుకోని ఆందోళన చేస్తారు.

- Advertisement -