రైతుబంధుపై అపోహలు వద్దు: నిరంజన్ రెడ్డి

278
niranjan reddy
- Advertisement -

రైతు బంధు పథకం నిరంతరాయంగా కొనసాగతుందని…ఎలాంటి అపోహలు వద్దన్నారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. మహబూబ్ నగర్ పట్టణ కేంద్రంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి రైతులకు రాయితీపై వచ్చిన రొట్ట ఎరువుల విత్తనాలను పంపిణీ చేశారు.

వచ్చే ఏడాది రాష్ట్రంలోని రైతులందరికీ పచ్చిరొట్ట ఎరువుల విత్తనాల పంపిణీకి కృషి చేస్తామన్నారు నిరంజన్ రెడ్డి. పాలమూరు – రంగారెడ్డి పథకం త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. త్వరలోనే సమగ్ర వ్యవసాయ విధానాన్ని సీఎం కేసీఆర్‌ ఆవిష్కరిస్తారని స్పష్టం చేశారు.

పాలమూరు – రంగారెడ్డి పథకానికి ఎలాంటి నష్టం జరగనివ్వబోము అని స్పష్టం చేశారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించాలని శ్రీనివాస్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు.

- Advertisement -