వెదురు సాగు పెరగాలి: నిరంజన్ రెడ్డి

115
minister niranjan
- Advertisement -

వెదురు సాగు పెరగాలన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. ఎకరానికి ఏటా లక్ష రూపాయల ఆదాయం వస్తుందని…ఆయిల్ పామ్ సాగు మాదిరిగానే ఎలాంటి చీడపీడలు, కోతులు, అడవి పందుల బెడద ఉండదన్నారు. మంత్రుల నివాస సముదాయం నుంచి జరిగిన వెదురు సాగు అవకాశాలు – లాభాలపై మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి జూమ్ సమావేశం నిర్వహించగా ఉద్యాన శాఖ డైరెక్టర్ వెంకట్రామ్ రెడ్డి , అటవీ ఫెడరేషన్ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి , ప్రముఖ వెదురు శాస్త్రవేత్త నంబీ భారతి , రాహుల్ బియాని , అమన్ క్వాతా , అటవీ, ఉద్యాన శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన నిరంజన్ రెడ్డి…తెలంగాణ ప్రాంతం వెదురు సాగుకు నేలలు అనుకూలం అన్నారు. గతంలో వెదురు అటవీ శాఖ పర్యవేక్షణలో పెరిగేదని…ప్రస్తుతం విద్యుత్ రంగంలో బొగ్గుకు ప్రత్యామ్నాయంగా వెదురును విరివిగా వినియోగిస్తున్నారన్నారు. ప్రతి ధర్మల్ విద్యుత్ కేంద్రంలో 5 శాతం వరకు వెదురును వినియోగించాలని కేంద్రం ఆదేశించిందన్నారు.

వెదురును ఉద్యాన పంటగా అధిక సాంద్రత పద్దతిలో ఎకరానికి వెయ్యి మొక్కల చొప్పున సూక్ష్మ సేద్యం ద్వారా సాగుచేయాలన్నారు. నాటిన రెండేళ్ళ నుండి ఏటా 40 టన్నుల దిగుబడి వస్తుందని….ప్రతి రెండేళ్లకు కోతకు వస్తుందన్నారు. ఇందులో 50 ఏళ్ల వరకు దిగుబడి వచ్చే భీమా బాంబూ రకాన్ని విరివిగా సాగు చేస్తున్నారన్నారు.కర్భన ఉద్గారకాలు తగ్గించి పర్యావరణ రక్షణకు వెదురు సాగు ఎంతో ఉపయోగపడుతుందని…2 లక్షల ఎకరాలలో వెదురు సాగుకు తెలంగాణ ప్రభుత్వ ఆలోచిస్తుందన్నారు.

- Advertisement -