పదవులు కేసీఆర్, కేటీఆర్ ఇస్తారు… నేను కాదు

22
mallareddy
- Advertisement -

మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే.మల్లారెడ్డి ప్రస్తుతం మేడ్చల్ ఎమ్మెల్యేగా ఉండగా.. మల్కాజ్ గిరి, ఉప్పల్ పరిధిలోని నియోజకవర్గాల్లో ఆయన జోక్యం చేసుకోవడంపై ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మంత్రి తీరుపై అసహనం వ్యక్తం చేశారు. తమ నియోజకవర్గంలో మంత్రి వేరేవారికి పదవులు ఇవ్వడం సరికాదని సూచించిన సంగతి తెలిసిందే.

ఇక దీనిపై స్పందించారు మంత్రి మల్లారెడ్డి. చిట్ చాట్‌లో మాట్లాడిన ఆయన పదవులు ఇచ్చేది తాను కాదని సీఎం కేసీఆర్, కేటీఆర్ పదవులు ఇస్తారని తెలిపారు.తాను ఎవరితో విబేధాలు పెట్టుకోనని మా మధ్య అంతా సమస్య లేదని చెప్పుకొచ్చారు.

తానే ఎమ్మెల్యే ల ఇంటికి వెళ్లి వారితో మాట్లాడతానని చెప్పారు. తాను గాంధేయవాదినని.. ఇది మా ఇంటి సమస్య… మీడియానే ఎక్కువగా చూపిస్తుందన్నారు. అవసరమైతే ఎమ్మెల్యేల ను అందరినీ మా ఇంటికి ఆహ్వానిస్తా…మాది క్రమశిక్షణ గల పార్టీ అని తెలిపారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -