పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి..

123
minister srinivas goud
- Advertisement -

శుక్రవారం రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక ,పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ది పనులను ప్రారంభించారు. ఇందులో భాగంగా అయోధ్య నగర్‌లో రూ. 15 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. పాత పాలమూరులో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న మినీ ఫంక్షన్ హాల్‌కు శంకుస్థాపన చేశారు. అనంతరం మహబూబ్ నగర్ జిల్లా పశుసంవర్ధక శాఖ నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం 2021 సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మహబూబ్‌నగర్ పట్టణంతోపాటు శివారు కాలనీలన్నింటిని అభివృద్ధి చేస్తామన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి వారి సౌకర్యాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామన్నారు. ప్రజలందరూ వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మహబూబ్‌నగర్ మున్సిపాలిటీతో పాటు, పట్టణానికి చుట్టూ పక్కల ఉన్న అన్ని కాలనీలను కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.

- Advertisement -