హైదరాబాద్ లో పెట్టుబడులపై మంత్రి కేటీఆర్

302
ktr
- Advertisement -

రేపు ఉదయం ఉదయం 11.30 గంటలకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ కీలక ప్రకటన చేయనున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. రాష్ట్రానికి కీలకమైన పెట్టుబడుల అంశంలో శుక్రవారం ప్రకటన చేయనున్నట్లు కేటీఆర్‌ ట్వీట్‌ ద్వారా వెల్లడించారు.

హైద‌రాబాద్ న‌గ‌రం కొత్త మైలురాయిని అందుకుంద‌ని తెలుపుతూ మంత్రి కేటీఆర్ అంత‌కుక్రితం ట్వీట్ చేశారు. ప్ర‌పంచంలోనే అతిపెద్దదైన వ‌న్‌ప్ల‌స్ స్టోర్ హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైంద‌ని చెప్ప‌డానికి సంతోషిస్తున్నానన్నారు. వ‌న్‌ప్ల‌స్ ఇండియా టీమ్‌కు మంత్రి శుభాకాంక్ష‌లు తెలిపారు. త్వ‌ర‌లోనే వ‌న్‌ప్ల‌స్ స్టోర్‌ను విజిట్ చేయ‌నున్న‌ట్లు పేర్కొన్నారు.గత ఆరేండ్లలో హైదరాబాద్‌ నగరాన్ని న్యూ టెక్‌హబ్‌గా తీర్చిదిద్దగలిగామని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. కొత్త రాష్ట్రమైన తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతున్నదన్నారు. ఆరోగ్యం, విద్యారంగాల్లో ప్రమాణాలు పాటిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.

- Advertisement -