రాజ‌న్న సిరిసిల్లలో మంత్రి కేటీఆర్‌ పర్యటన..

202
ktr
- Advertisement -

రాజ‌న్న సిరిసిల్ల ఐటీ, మున్సిపల్‌ శాఖల మంత్రి కేటీఆర్‌ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అలాగే ఈ పర్యటనలో వివేకానంద విగ్రహం దగ్గర సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టం, బస్టాండ్‌ వద్ద మహిళా సంఘ భవనం, తాసిల్‌ నూతన కార్యాలయ భవనం, రైతువేదిక, కూరగాయల అంగడిని ప్రారంభించారు.

అనంతరం అక్కడే నిర్వహించే బహిరంగ సభలో మంత్రి కేటీఆర్‌ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. పర్యటన మగిసిన అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు హైదరాబాద్‌కు తిరుగుపయనమవుతారు మంత్రి కేటీఆర్‌. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి వెంట ఎమ్మెల్యే ర‌స‌మ‌యి బాలకిష‌న్‌, న్యాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావుతో పాటు త‌దిత‌రులు పాల్గొన్నారు.

- Advertisement -