కోదండ రాముడి భారీ విగ్రహాన్ని ఆవిష్కరించిన కేటీఆర్‌..

154
- Advertisement -

శుక్రవారం మంత్రి కేటీఆర్ జగిత్యాల జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. ఇందులో భాగంగా ఆయన మెట్‌పల్లి మండలం బండ లింగాపూర్‌లోని గండి హనుమాన్ ఆలయాన్ని దర్శించుకున్నారు. హనుమాన్‌ దేవాలయంలో కేటీఆర్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుడి అర్చకులు మంత్రి కేటీఆర్ కు తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం గుడి ఆవరణలో కోదండ రాముడి భారీ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్ రెడ్డి,స్థానిక ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు పాల్గొన్నారు.

- Advertisement -