KTR:కరువు నేలలో కృష్ణమ్మ జలతాండవం..

30
- Advertisement -

తెలంగాణ సాగునీటి చరిత్రలో ఇవాళ అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. ఇవాళ నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం నార్లాపూర్‌ వద్ద పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా పాలమూరు ప్రాజెక్టు గురించి ప్రస్తావించారు కేటీఆర్.

తరతరాల ఎదురు చూపులు ఫలించే వేళ ..
పల్లేర్లు మొలిచిన పాలమూరులో
పాలనురగల జలహేల!

వలసల వలపోతల గడ్డపైన
ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం ఆవిష్కృతం!

కరువు కరాళ నృత్యం చేసిన భూముల్లో ..
కృష్ణమ్మ జల తాండవం!

శెలిమలే దిక్కైన కాడ
ఉద్దండ జలాశయాలు..!
బాయిమీద పంపుసెట్లు నడవని చోట బాహుబలి మోటర్లు ..!

స్వరాష్ట్ర ప్రస్థానంలో సగర్వ
సాగునీటి సన్నివేశం..!

ఆరు జిల్లాలు సస్యశ్యామలం
దక్షిణ తెలంగాణకు దర్జాగా జలాభిషేకం!

నిన్న..పరాయి నేలపైన ప్రాజెక్టులకు రాళ్ళెత్తిన పాలమూరు లేబర్ !

నేడు..సొంత భూమిలో ప్రాజెక్టుల కింద రతనాలు పండిస్తున్న ఫార్మర్..!

నాడు ..నది పక్కన నేల ఎడారిలా ..ఎండిన విషాదం !

సమైక్య పాలకుల పాపం.. కాంగ్రెసోళ్ల శాపం!

బిర బిరా తరలి వెళ్తున్న కృష్ణమ్మను
బీడు భూములకు రప్పించేందుకు
స్వయం పాలనలో సాహస యజ్ఞం!

ఆటంకాలు అవరోధాలు అధిగమించి..
ప్రతి పక్షాల కుట్రలు కేసులు ఛేదించి
సవాల్ చేసి సాధించిన విజయం!

నీటి వాటా తేల్చకుండా నిర్లక్ష్యం
అనుమతుల్లో అంతులేని జాప్యం
ఐనా.. కేంద్ర సర్కారు కక్షను వివక్షను దీక్షతో గెలిచిన దృఢ సంకల్పం!

తీరిన దశాబ్దాల నీటి వెత
తెచ్చుకున్న తెలంగాణకు ఇదే సార్థకత..!

తీరిన దశాబ్దాల నీటి వెత
తెచ్చుకున్న తెలంగాణకు ఇదే సార్థకత..!’’ అని పేర్కొన్నారు.

- Advertisement -