KTR:లోకేష్ ట్వీట్ చూసి బాధేసింది..

27
- Advertisement -

చంద్రబాబు భద్రతపై లోకేష్ చేసిన ట్వీట్ పై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉదయం లోకేష్ ట్వీట్ చూసి భాద అనిపించిందని…చంద్రబాబు భద్రత విషయంలో లోకేష్ వ్యక్తం చేసిన ఆందోళనను ఒక కొడుకుగా అర్థం చేసుకోగలను అని..లోకేష్ చెప్పింది వాస్తవం అయితే ఈ పరిస్థితి భాదకరం అన్నారు. నాకు ప్రస్తుతం ఉన్న పరిస్ధితుల నిజానిజాలు తెలియవు, కానీ అయన భద్రతకు ప్రమాదం అయితే రాజకీయల్లో ఇది దురదృష్టకరం అన్నారు.

లోకేష్ పరిస్ధితిని అర్ధం చేసుకోగలను…రాజకీయలు వేరయిన అయన కుటుంబం బాధను నేను అర్ధం చేస్కోగలను. వారికి నా సానుభూతి..నిమ్స్ ఆసుపత్రిలో కేసిఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో ఆయన ఆరోగ్యం పై మేము కూడా చాలా ఆందోళన చెందాం అన్నారు. కెసిఆర్ ఆరోగ్య పరిస్థితి విషమించే ప్రమాదం పొంచి ఉందని ఇంటలిజెన్స్ అధికారులు మమ్మల్ని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు….ఇలాంటి సందర్భాల్లో ఏలాంటి మానస్దిక స్ధితి ఉంటుందో అర్ధం చేస్కోగలను అని చెప్పారు. హైదరాబాద్ శాంత భద్రతలకు విఘాతం కలగవద్దన్న నేపథ్యంలోనే ఇక్కడ అందోళన చేయడం వద్దు అన్నాను..రెండు పార్టీల మద్య ఉన్న రాజకీయాలలోకి తెలంగాణలో లాగవద్దు అని మాత్రమే సూచించానని తెలిపారు.

Also Read:KTR:BRSలోకి పొన్నాల వస్తే…స్వాగతిస్తాం

- Advertisement -