ప్ర‌ధాని మోదీని ఉద్దేశించి మంత్రి కేటీఆర్ సంచలన ట్వీట్..

60
ktr minister
- Advertisement -

కేంద్ర‌ ప్ర‌భుత్వం ఫిబ్ర‌వ‌రి 1న‌ పార్లమెంట్‌లో 2022-23 బ‌డ్జెట్ ను ప్ర‌వేశ‌పెట్ట‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని ఉద్దేశించి మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ జీ.. ఎన్డీఏ గ‌వ‌ర్న‌మెంట్ బ‌డ్జెట్ 2022ను ప్ర‌వేశ‌పెట్టేందుకు సిద్ద‌మైన నేప‌థ్యంలో గతంలో కేంద్రం ఇచ్చిన హామీలను మరోసారి గుర్తు చేయాలనుకుంటున్నానని తెలిపారు.

2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారని, ప్రతి భారతీయుడికి ఇల్లు నిర్మించి ఇస్తామన్నారని కేటీఆర్ ప్రస్తావించారు. అలాగే ఇంటింటికీ నీరు, విద్యుత్, టాయిలెట్ సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని కూడా హామీ ఇచ్చారని వివరించారు. విభజన చట్టంలోని హామీలన్నింటిని నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు.

హామీలకు న్యాయం చేసేలా బడ్జెట్ లో తెలంగాణకు కేటాయింపులు ఉంటాయని ఆశిస్తున్నట్టు తెలిపారు. నీతి ఆయోగ్ పేర్కొన్న మేరకు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు నిధులు అందజేయాలని కోరారు. 2022 బడ్జెట్ లో కేటాయింపులు వాస్తవికతను ప్రతిబింబించేలా ఉంటాయని భావిస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు.

- Advertisement -