సంగారెడ్డి పర్యటనకు మంత్రి కేటీఆర్..

25
ktr
- Advertisement -

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పలు జిల్లాలు పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఇవాళ సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా జహీరాబాద్‌లో అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేయనున్నారు. నిమ్జ్‌ తొలి పరిశ్రమ స్థాపనకు కేటీఆర్‌ భూమి పూజ చేయనున్నారు. నిమ్జ్‌లో రూ. వేయి కోట్లతో 511 ఎకరాల్లో పరిశ్రమ నిర్మాణం చేపట్టనున్నారు. అనంతరం వాయు ఈవీ పరిశ్రమను కేటీఆర్ ప్రారంభించనున్నారు.

- Advertisement -