కేంద్రమంత్రి పీయూష్‌తో మంత్రి కేటీఆర్ భేటీ..

98
ktr it
- Advertisement -

ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని ఢిల్లీకి చేరిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పలువురు కేంద్రమంత్రులను కలవనున్నారు. ఇందులో భాగంగా ఇవాళ మధ్యాహ్నం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో మంత్రి కేటీఆర్‌ ఆధ్వర్యంలోని బృందం భేటీ కానుంది.

తెలంగాణ రాష్ట్రం నుంచి సంవత్సరానికి ఎంత ధాన్యం?.. ఏ రూపంలో కొనుగోలు చేస్తారో? తేల్చాలని బృందం సభ్యులు కేంద్రాన్ని కోరనున్నారు.ఈ సమావేశంలో టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు, మంత్రులు గంగుల కమలాకర్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, టీఆర్ఎస్ ఎంపీలు తదితరులు పాల్గొననున్నారు.

కేంద్రం ధాన్యం కొనుగోలు చేయమని ప్రకటించడంతో మంత్రులు, అధికారుల బృందంతో సీఎం కేసీఆర్‌ ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే.

- Advertisement -