చండూరు ను అద్దంలా తీర్చిదిద్దుతా : కేటీఆర్‌

33
Minister KTR Speech in Chandur Public Meeting
Minister KTR Speech in Chandur Public Meeting
- Advertisement -

మున్సిపల్‌ శాఖామంత్రి కేటీఆర్‌ మునుగోడు నియోజకవర్గంలోని చండూరు మున్సిపాలిటీపై వరాల జల్లు కురిపించారు. ఇవాళ చండూరులో పర్యటించిన మంత్రి కేటీఆర్‌ మంత్రి జగదీష్‌ రెడ్డి, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.

అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ మాట్లాడుతూ గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వారు మునుగోడు నియోజకవర్గాన్ని ఏనాడు పట్టించుకోలేదని.. నాలుగేండ్లలో ఒక్కసారి కూడా మునుగోడును కన్నెత్తికూడా చూడలేదని మంత్రి కేటీఆర్‌ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. కానీ ఎమ్మెల్యేగా మీ ఆశీర్వాదంతో గెలిచిన కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి గెలిచిన రెండు నెలల్లోనే నియోజకవర్గం మొత్తం కలియతిరుగుతూ అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తున్నారన్నారు మంత్రి కేటీఆర్‌. ఎన్నికలు వచ్చినపుడు రాజకీయాలు మాట్లాడుతుతామని, మిగతా టైంలో ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామన్నారు మంత్రి కేటీఆర్‌. ప్రజల ఆశీర్వాదంతో, మీరందిస్తున్న ఉత్సాహంతో మరింత రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తామని మంత్రి కేటీఆర్‌ అన్నారు.

పేద‌వాడి ముఖంలో చిరున‌వ్వు లేక‌పోతే ఆ ప్ర‌భుత్వం ప‌నికిమాలిన ప్ర‌భుత్వం కింద‌నే లెక్క అని కేసీఆర్ అంటుంటారని కేటీఆర్ గుర్తు చేశారు. ఇంటింటికి మంచినీరు ఇచ్చి ఫ్లోరోసిస్ స‌మ‌స్య‌కు శాశ్వ‌త ప‌రిష్కారం చూపించామ‌ని తెలిపారు. ఆడ‌బిడ్డ‌ల క‌ష్టాల‌ను తీర్చింది కేసీఆర్ మాత్ర‌మే. సాగునీటి సౌక‌ర్యాన్ని కూడా క‌ల్పిస్తున్నామ‌ని చెప్పారు. ఆ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించే బాధ్య‌త కూడా కేసీఆర్‌దేనని అన్నారు మంత్రి కేటీఆర్‌. కేసీఆర్ నేతృత్వంలో పూర్వ‌పు న‌ల్ల‌గొండ జిల్లాలో అభివృద్ధి కార్య‌క్ర‌మాలు బ్ర‌హ్మాండంగా కొన‌సాగుతున్నాయని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

- Advertisement -