తగిన సమయంలో బీజేపీకి బుద్దిచెపుతాం: కేటీఆర్

139
KTR
- Advertisement -

చిన్న చిన్న విజ‌యాల‌కే ఎగిరెగిరి ప‌డుతున్న బీజేపీ నేత‌ల‌కు త‌గిన స‌మ‌యంలో బుద్ధి చెప్తామ‌న్నారు మంత్రి కేటీఆర్. రాజన్న సిరిసిల్ల పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలోని పద్మనాయక కల్యాణమండపంలో పార్టీ కార్యకర్తల విస్తృత స్ధాయి సమావేశంలో పాల్గొని ప్రసంగించారు కేటీఆర్.

ఈ 20 ఏండ్ల కాలంలో టీఆర్ఎస్ చ‌రిత్ర‌లో ఎన్నో విజ‌యాలు సాధించాం..కానీ ఎనాడూ గర్వంతో పొంగిపోలేదన్నారు. తమ సహనాన్ని అసమర్థతగా భావించవద్దని హెచ్చరించారు. నాటి ముఖ్య‌మంత్రుల‌ను ఉరికించిన చ‌రిత్ర టీఆర్ఎస్ పార్టీకి ఉందని….ఆ విష‌యాన్ని బీజేపీ నాయ‌కులు మ‌రిచిపోవ‌ద్దన్నారు.

కేసీఆర్ ప‌రిపాల‌నాద‌క్షుడు అని కేంద్ర‌మంత్రులే చెప్పారు. వంద‌శాతం సాగు, తాగునీరు ఇస్తున్న ఏకైక రాష్‌ర్టం తెలంగాణ అన్నారు. టీఆర్ఎస్ ప్ర‌భుత్వంలో 24 గంట‌ల క‌రెంట్ ఇస్తున్నామ‌ని తెలిపారు. దేశంలో 24 గంట‌ల క‌రెంట్ ఇస్తున్న రాష్ర్టం తెలంగాణ మాత్ర‌మే అని స్ప‌ష్టం చేశారు. రైతుబంధు, రైతుబీమా, రుణ‌మాఫీల‌తో రైతుల‌ను ఆదుకుంటున్న ప్ర‌భుత్వం టీఆర్ఎస్ ప్ర‌భుత్వం మాత్ర‌మే అని తేల్చిచెప్పారు.

- Advertisement -