KTR:గంగులతో పోటీ అంటే పారిపోతున్నారు

31
- Advertisement -

కరీంనగర్‌లో మంత్రి గంగుల కమలాకర్‌తో పోటీ అంటే పారిపోతున్నారని బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు మంత్రి కేటీఆర్. కరీంనగర్‌ బీఆర్ఎస్ బహిరంగసభలో మాట్లాడిన కేటీఆర్..ఎంపీగా కరీంనగర్‌కు బండి సంజయ్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకప్పుడు నీటి కొరతతో ఉండే కరీంనగర్ ఇప్పుడు సజీవ జలధారలా కనిపిస్తోందని … కరీంనగర్ లో వచ్చిన మార్పుని ప్రజలు గమనించి ఓటు వేయాలని సూచించారు.

మతం పేరుతో చిచ్చు పెట్టేవారిని నమ్మొద్దన్నారు. కేసీఆర్ ఎప్పుడు మతం పేరుతో రాజకీయాలు చేేయలేదన్నారు. మోదీ దేవుడు అని బండి సంజయ్ అంటున్నారు.. కానీ మోడీ ఎవరికి దేవుడో ఆయనే చెప్పాలని ప్రశ్నించారు. పోరాడి సాధించుకుని అభివృద్ధి చేసుకుంటున్న తెలంగాణను ఎవరి చేతుల్లో పెట్టాలో ఆలోచించిండి అంటూ విజ్ఞప్తి చేశారు.

తాగునీరు, సాగునీరు కష్టాలతో పాటు కరెంట్ కష్టాల్ని కూడా పరిష్కరించుకున్నామని తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నాలుగు మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసుకున్నామని యువతకు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న పార్టీ బీఆర్ఎస్ అన్నారు. ఎన్నికల వేళ ఎంతోమంది నేతలు వస్తారు.. మాయ మాటలు చెబుతారు కానీ ఏది మంచో ఏది చెడో ఆలోచించుకోవాలన్నారు. ప్రవళిక మరణం గురించి కేటీఆర్ స్పందిస్తూ.. ఆమె మరణాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు అంటూ మండిపడ్డారు. ప్రవళిక కుటుంబానికి న్యాయం చేస్తామని …ఆమె తమ్ముడికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు.

Also Read:రేణు దేశాయ్‌ రెండో పెళ్లి అప్పుడే  !

- Advertisement -