త‌ల‌సానిని భారీ మెజార్టీతో గెలిపించాలిః కేటీఆర్

330
ktr
- Advertisement -

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా మంత్రి కేటీఆర్ ఈరోజు స‌న‌త్ న‌గ‌ర్ లో రోడ్ షో నిర్వ‌హించారు. ఈకార్య‌క్ర‌మంలో భారీగా కార్య‌క‌ర్త‌లు, ప్ర‌జ‌లు పాల్గోన్నారు. ఈకార్య‌క్ర‌మంలో స‌న‌త్ న‌గ‌ర్ టీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్ది త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ , ప‌లువురు నేత‌లు పాల్గోన్నారు. ఈసంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ముస్లింల‌ను టీడీపీ, కాంగ్రెస్ ప్ర‌భుత్వాలు ఓటు బ్యాంకుగానే చూశాయ‌న్నారు.

ktr

మైనార్టీల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్ర‌భుత్వం అనేక కార్య‌క్ర‌మాలు చేప‌ట్టింద‌న్నారు. పేద ప్ర‌జ‌ల‌కు టీఆర్ఎస్ ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంద‌న్నారు. హైద‌రాబాద్ లో టీఆర్ఎస్ ప్ర‌భుత్వం చాలా మంచి ప‌నులు చేసింద‌న్నారు. గ‌త ప్ర‌భుత్వాలు ఉన్న‌ప్పుడు హైద‌రాబాద్ లో ఎప్పుడూ గొడ‌వ‌లు జ‌రిగివేవ‌ని, టీఆర్ఎస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ఎటువంటి గొడ‌వ‌లు జ‌ర‌గ‌లేద‌న్నారు. స‌న‌త్ న‌గ‌ర్ అభ్య‌ర్ధి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ ను భారీ మెజార్టీతో గెలిపించాల‌ని కోరారు.

- Advertisement -