త్వరలో 50 వేల పోస్టులకు నోటిఫికేషన్లు: కేటీఆర్

250
ktr
- Advertisement -

త్వరలో 50 వేల పోస్టులకు నోటిఫికేషన్లు ఇవ్వనున్నామని తెలిపారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ జలవిహార్‌లో రిక‌గ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో క‌ర‌స్పాండెన్స్‌, టీచ‌ర్ల స‌మావేశం జ‌రిగింది.

ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్… టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఓట్ల కోసం, సీట్ల కోసం ప‌ని చేయ‌దు అని స్ప‌ష్టం చేశారు. త‌మ ప్ర‌భుత్వం ఏప‌ని చేసినా చిత్త‌శుద్ధితో చేస్తుంద‌ని వెల్లడించారు. తెలంగాణ ఏర్ప‌డిన త‌ర్వాత ఈ ఆరున్న‌రేండ్ల కాలంలో ఎన్నో స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకున్నాం. విద్యుత్ స‌మ‌స్య‌ల‌ను అధిగ‌మించాం. మంచి నీటి క‌ష్టాల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం చూపుతున్నామ‌ని తెలిపారు.

గురుకుల పాఠ‌శాల‌ల్లో ల‌క్ష‌లాది మంది విద్యార్థులు చ‌దువుకుంటున్నారు. ఓవ‌ర్సీస్ స్కాల‌ర్‌షిప్ ద్వారా రాష్ర్ట విద్యార్థుల‌కు విదేశాల్లో విద్యను అందిస్తుంద‌ని తెలిపారు. ఆరేళ్ల‌లో ల‌క్షా 32 వేల ఉద్యోగాలు ఇచ్చామ‌న్నారు. కాంగ్రెస్ హ‌యాంలో ఏడాదికి వెయ్యి ఉద్యోగాలు మాత్ర‌మే ఇచ్చారు… ఉద్యోగాల భ‌ర్తీ విష‌యంలో శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేసిన త‌ర్వాత ప్ర‌తిప‌క్షాలు మాట మార్చాయ‌ని అన్నారు.

- Advertisement -