గ్రేటర్‌కు నలుమూలాల వెయ్యి ప‌డ‌క‌ల ఆస్ప‌త్రులు: కేటీఆర్

37
minister
- Advertisement -

హైద‌రాబాద్‌కు నలుమూలాల వెయ్యి ప‌డ‌క‌ల ఆస్ప‌త్రుల‌ నిర్మాణం చేపడతామన్నారు మంత్రి కేటీఆర్. ఉప్ప‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలోని మ‌ల్లాపూర్‌లో నూత‌నంగా నిర్మించిన‌ వైకుంఠ‌ధామాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్….సీఎం కేసీఆర్ నాయ‌క‌త్వంలో అభివృద్ధి శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. సంక్షేమంలో కూడా ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటున్నాం అన్నారు.

వచ్చే నెల నుండి కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నాం అని చెప్పారు.జాగ ఉండి ఇల్లు క‌ట్టుకునే వారికి రూ. 3 ల‌క్షలు ఇస్తామ‌న్నారు. ఈ ఏడేండ్ల‌లో ఎన్నో అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టామ‌న్నారు. 90 వేల ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్లు ఇవ్వ‌బోతున్నామ‌ని తెలిపారు.

ఉప్ప‌ల్ వ‌ద్ద ట్రాఫిక్ బాగా పెరిగిపోతోంది. దీంతో అక్క‌డ ఫ్లై ఓవ‌ర్లు, స్కైవేలు క‌డుతున్నామ‌ని తెలిపారు. ఉప్ప‌ల్‌లో అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో రూ. 35 కోట్ల స్కై వాక్‌ను నిర్మిస్తున్నాం అన్నారు.

- Advertisement -