ఫర్టిలైజర్స్ కంపెనీ పునరుద్దరణపై మంత్రి కేటీఆర్ సమీక్ష

370
ktr
- Advertisement -

రామగుండం ఫర్టిలైజర్స్ కంపెనీ పునరుద్దరణ పనులపైన పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈరోజు మంత్రి కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి యంపి వేంకటేష్ నేత, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మరియు పరిశ్రమల శాఖాధికారులతో కలిసి కంపెనీ ప్రతినిధి బృందంతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కంపెనీ పున:ప్రారంభానికి తెలంగాణ ప్రభుత్వం ఎంతోప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. కంపెనీ కార్యకలాపాల ప్రారంభం కోసం అవసరం అయిన అన్ని విధాల సహాయ సహాకారాలను అందిస్తామని తెలిపారు. ప్రజలకు తాము హమీ ఇచ్చిన మేరకు కంపెనీ పునరుద్దరణరకు కృషి చేశామన్నారు. అందుకే కంపెనీ పునరుద్దరణలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యక్ష భాగసామ్యం(వాటా) తీసుకున్నదన్నారు. మూతపడిన బిల్ట్ లాంటి కంపెనీలను తిరిగి ప్రారంభించేందుకు పరిశ్రమల శాఖ తరపున ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో ఫ్యాక్టరీ పునరుద్దరణ కార్యకలాపాల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ktr ramagundam

ఈ సందర్భంగా ఫ్యాక్టరీకి అవసరం అయిన ఉద్యోగాల కల్పనలో స్ధానికులకు సాద్యమైనంత మేర అవకాశాలు ఇవ్వాలని కోరారు. కంపెనీ అవసరాల మేరకు తెలంగాణ అకాడమీ అఫ్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ద్వారా యువకులకు ప్రభుత్వ ఖర్చులతో శిక్షణ ఇస్తామని, అందులోంచి ఉద్యోగులను ఎంపిక చేసుకోవాలని ప్రతిపాదించారు. ముఖ్యంగా స్కిల్డ్, సెమిస్కిల్డ్ సిబ్బంది కోసం టాస్క్ ద్వారా ప్రత్యేక కోర్సులు తయారు చేసి, శిక్షణ ఇచ్చేందుకు సైతం సిద్దంగా ఉన్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈమేరకు అర్ యఫ్ సియల్ తో కలిసి పనిచేయాలని సమావేశానికి హాజరైన టాస్క్ ప్రతినిధులను అదేశించారు.

దీంతోపాటు అన్ సిల్డ్ కార్మికులను జిల్లా ఏంఫ్లాయ్ మెంట్ ఎక్జ్సేంజీ ద్వారా భర్తీ చేసుకునే అవకాశాలను పరిశీలించాలన్నారు. కంపెనీ పరిసరాల్లో గతంలో ఉన్న కేంద్రీయ విద్యాలయాన్ని తిరిగి ప్రారంభించాలని స్ధానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కోరారు. ఈమేరకు పాత కేంద్రీయ విద్యాలయాన్ని పున:ప్రారంభించేందుకు కేంద్ర మానవవనరుల శాఖా మంత్రికి ఒక లేఖ రాస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. దీంతోపాటు కంపెనీకి అవసరం అయిన రవాణా, హమాలీ వంటి అంశాల్లోనూ కంపెనీ పరిసర ప్రాంతాల్లోని ప్రజలను ఉపయోగించుకోవాలని మంత్రులు కోరారు. ఈ సమావేశంలో అర్ యఫ్ సియల్ అధికారులతోపాటు పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -