ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? ఎన్జీవోనా..?: ప్రధానికి కేటీఆర్ ప్రశ్న

70
bjp
- Advertisement -

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బీజేపీ కార్పొరేటర్లు ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు మంత్రి కేటీఆర్. గ్రేటర్ హైదరాబాద్‌లో వర్సాలు పడితే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ప్రశ్నించారు. మోదీజీ.. మీరు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా..? ఎన్జీవోనా అంటూ విమర్శలు గుప్పించారు.

గంటన్నర పాటు బీజేపీ కార్పొరేటర్లతో ప్రధాని సమావేశమయ్యారు. మూసి రెన్నోవేషన్‌కు సంబంధించి ఏదైనా అప్‌డేట్ ఉందా లేదా హైదరాబాద్ మెట్రో ఎక్స్‌టెన్షన్‌ గురించి ఈ సమావేశంలో ప్రస్తావించారా అని ప్రశ్నల వర్షం కురిపించారు కేటీఆర్. హైదరాబాద్‌కు మాటలు గుజరాత్‌కు డబ్బుల మూటలా అంటూ తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారు కేటీఆర్.

- Advertisement -