ప్రకాశ్‌ రాజ్‌పై మంత్రి కేటీఆర్ ప్రశంసలు..

34
- Advertisement -

సినీ నటుడు ప్రకాశ్ రాజ్‌పై ప్రశంసలు గుప్పించారు మంత్రి కేటీఆర్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామజ్యోతి కార్యక్రమంలో భాగంగా 2015లో షాద్‌నగర్‌ అసెంబ్లీ కేశంపేట మండలంలోని కొండారెడ్డిపల్లి గ్రామాన్ని దత్తత తీసుకున్నారు ప్రకాశ్‌ రాజ్‌. తర్వాత గ్రామ అభివృద్ధికి దశల వారీగా ప్రత్యేక చొరవ తీసుకుని అభివృద్ధి చేశారు.

గ్రామానికి సంబంధించిన ఫోటోలను మధుసూదన్ రావు అనే వ్యక్తి కేటీఆర్‌కు ట్యాగ్ చేయగా దీనిపై ఆయన స్పందించారు. ప్రకాశ్‌ రాజ్ దత్తత తీసుకున్న గ్రామం ఎంతో అభివృద్ధి చెందిందని..స్ధానిక ఎమ్మెల్యే అంజయ్యతో కలిసి గొప్ప పురోగతిని సాధించారని కొనియాడారు.

గ్రామంలో సిమెంట్ రోడ్డుకు ఇరువైపులా ఫుట్‌పాత్, దిమ్మెలను ఏర్పాటు చేశారు. చెట్లను పెంచి గ్రామంలోని వీధులన్నింటిని ఆకుప‌చ్చ‌గా తయారు చేశారు. గ్రామంలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు.

- Advertisement -